అక్షరటుడే, వెబ్డెస్క్: Railway Charges | భారతీయ రైల్వే(Indian Railways) టికెట్ రేట్లను పెంచనుంది. జూలై 1 నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది. కోవిడ్-19 తర్వాత ఇప్పటివరకు రైల్వే ఛార్జీలు పెంచలేదు. అయితే, తాజాగా టికెట్ రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్ల (నాన్-AC) చార్జీలను కిలోమీటరుకు ఒక పైసా చొప్పు, అలాగే, AC తరగతి ప్రయాణానికి కిలోమీటరుకు రెండు పైసలు పెంచాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది.
Railway Charges | వాటి ధర పెరగదు..
రైలు ఛార్జీలు(Railway Charges) పెంచుతున్నప్పటికీ, కేంద్రం కొన్నింటికి ధరల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. సబర్బన్ రైళ్ల టికెట్ చార్జీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిసింది. 500 కిలోమీటర్ల వరకు రెండో తరగతి ప్రయాణానికి ఛార్జీలు మారవు. 500 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లకు కిలోమీటరుకు ఒక పైసా ఛార్జీ పెంపు ఉంటుంది. ఒక నెల పాటు పేర్కొన్న స్టేషన్లు లేదా మార్గాల మధ్య అపరిమిత ప్రయాణాన్ని అనుమతించే నెలవారీ సీజన్ టికెట్ (MST) పాత ధరలకే అందుబాటులో ఉంటుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 1, 2025 నుంచి IRCTC వెబ్సైట్, యాప్ ద్వారా అన్ని తత్కాల్ టికెట్ బుకింగ్కు (Tatkal ticket bookings) ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేసింది. తత్కాల్ పథకం దుర్వినియోగాన్ని అరికట్టడానికే ఈ చర్య చేపట్టింది. ఇక జూలై 15 నుంచి దీన్ని కట్టుదిట్టం చేయనుంది. ప్రయాణికులు ఆధార్ ఆధారంగా OTP ధ్రువీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది.