అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Kantha Rao | దేశ ప్రజల సహకారంతో రాహుల్గాంధీని (MP Rahul Gandhi) ప్రధానిగా చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో నిజాంసాగర్ (Nizam sagar), మహమ్మద్నగర్ (Mahammad nagar) కాంగ్రెస్ రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు.
నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండలాల నాయకులతో కలిసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ (Pitlam Market Committee) ఛైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, నాయకులు గుర్రపు శ్రీనివాస్, ప్రజాపండరి, ప్రతాప్రెడ్డి, సవాయ్సింగ్, లోకియా నాయక్, గంగి రమేష్, నాగభూషణం నాయకులు తదితరులున్నారు.