More
    Homeభక్తిPuri Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ రథయాత్రలో 600 మందికి అస్వస్థత..

    Puri Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ రథయాత్రలో 600 మందికి అస్వస్థత..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Puri Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఇసుకేస్తే రాలనంత జనంగా మారింది. పూరీలోని వీధులు అన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. స్వ‌ల్పంగా తోపులాట కూడా జ‌రిగిన‌ట్టు అధికారాలు చెబుతున్నారు. 600 మందికి పైగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. ఒడిశా(Odisha)లోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన రథయాత్ర కార్యక్రమం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా సాగింది. “జై జగన్నాథ” నినాదాలతో నగర వీధులన్నీ మార్మోగాయి. ఈ పవిత్ర ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది భక్తులు(Devotees) దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు.

    READ ALSO  Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Puri Jagannath Rath Yatra | స్వ‌ల్ప తొక్కిస‌లాట‌..

    అయితే, అధిక ఉష్ణోగ్రత (Temperature), ఉక్కపోత, భారీ రద్దీ కారణంగా 625 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి వైద్యసేవలు అందించామని అధికారులు తెలిపారు. అందులో చాలామందికి ప్రాథమిక చికిత్స అందించి తిరిగి పంపించామని, ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. రథాలను లాగేందుకు భక్తులు పోటీపడుతుండడంతో కొంతమంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. వారికీ వెంటనే వైద్యసహాయం అందించబడింది. పరిస్థితిని ముందస్తుగా అంచనా వేసిన అధికారులు, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టారు.

    ర‌థ‌యాత్ర‌ సందర్భంగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu), సీఎం మోహన్ చరణ్ మాఝీ(CM Mohan Charan Majhi) రథయాత్రలో పాల్గొన్నారు. వారు స్వయంగా జగన్నాథుడు, దేవి సుభద్రా, బలభద్రుని రథాలను లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ ఏడాది పూరీ జగన్నాథ రథయాత్ర భారీ జనసందోహం, ఎండ కారణంగా కొంత వరకు ఇబ్బంది ఎదురైంది. అయినా కూడా సేవా సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం చర్యల వల్ల ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం సాఫీగా ముగిసింది. అస్వ‌స్థ‌త‌కి గురైన 70 మంది జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలియ‌జేశారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి ప్రత్యేక వైద్య బృందాలు(Specialized medical teams) చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

    Latest articles

    CP Sai Chaitanya | పోలీసుల దిగ్బంధంలో ఇందూరు

    అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union Home...

    IPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్..నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPS officer Parag Jain | భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ ఏ...

    Police transfers | రాష్ట్రంలో 44 మంది డీఎస్పీల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Police transfers | తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీలు, డీఎస్పీలు బదిలీ (ACPs and DSPs transfers)...

    Vice President Dhankhar | ప్ర‌వేశిక‌ను మార్చ‌లేము కానీ.. 1976లోనే మార్చార‌ని గుర్తు చేసిన ధ‌న్‌ఖ‌డ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vice President Dhankhar | రాజ్యాంగ ప్ర‌వేశిక మార్పుపై వివాదం నెల‌కొన్న త‌రుణంలో ఉప రాష్ట్ర‌ప‌తి...

    More like this

    CP Sai Chaitanya | పోలీసుల దిగ్బంధంలో ఇందూరు

    అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union Home...

    IPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్..నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPS officer Parag Jain | భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ ఏ...

    Police transfers | రాష్ట్రంలో 44 మంది డీఎస్పీల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Police transfers | తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీలు, డీఎస్పీలు బదిలీ (ACPs and DSPs transfers)...