ePaper
More
    HomeజాతీయంPune | పుణె టెకీ రేప్ కేసులో ట్విస్ట్.. అస‌లు అత్యాచారమే జ‌రగ‌లేద‌న్న పోలీసులు

    Pune | పుణె టెకీ రేప్ కేసులో ట్విస్ట్.. అస‌లు అత్యాచారమే జ‌రగ‌లేద‌న్న పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pune | సంచ‌ల‌నం సృష్టించిన పుణె టెకీ రేప్ కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. అస‌లు అత్యాచార‌మే జ‌ర‌గ‌లేద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. బాధితురాలే క‌ట్టుక‌థ అల్లింద‌ని పోలీసులు ఆదివారం వెల్ల‌డించారు. ఫుడ్ డెలీవ‌రీ బాయ్‌గా (food delivery boy) వ‌చ్చిన దుండ‌గుడు త‌న ఇంట్లోకి వ‌చ్చి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని పుణెకు చెందిన 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

    దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెను విచారించ‌గా పొంత‌న లేని స‌మాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వ‌చ్చి, సీసీ ఫుటేజ్‌లు (CCTV footage) ప‌రిశీలించ‌గా, ఆమె చెప్పిన‌ట్లు అపార్ట్‌మెంట్‌లోకి ఫుడ్ డెలీవ‌రీ బాయ్‌లు ఎవ‌రూ రాలేద‌ని వెల్ల‌డైంది. బాధితురాలు త‌ప్పుడు ఫిర్యాదు చేసింద‌ని, ఉద్దేశ‌పూర్వ‌కంగానే తప్పుదారి పట్టించింద‌ని పోలీసులు తెలిపారు. డెలివరీ ఏజెంట్‌గా నటిస్తూ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడనే ఆరోపణలతో సహా మహిళ ఆరోప‌ణ‌ల‌న్నీ కల్పితమని పోలీస్ కమిషనర్ అమితేశ్‌ కుమార్ (Police Commissioner Amitesh Kumar) వెల్ల‌డించారు.

    READ ALSO  Helmets | నాసిరకం హెల్మెట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

    Pune | పొంత‌న లేని స‌మాధానాలు..

    బాధితురాలు త‌న‌పై దాడి జ‌రిగింద‌ని ఇటీవ‌ల పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. కొరియర్ డెలివరీ వ్యక్తిగా వ‌చ్చిన ఓ వ్య‌క్తి.. తన కొంధ్వా ఫ్లాట్‌లోకి ప్రవేశించాడ‌ని ఫిర్యాదులో పేర్కొంది. తలుపు గడియ వేసి, తాను స్పృహ కోల్పోయేలా ఒక రసాయనాన్ని స్ప్రే చేసి, తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. దుండగుడు తన ఫోన్‌లో సెల్ఫీ తీసుకొని బెదిరించాడ‌ని ఆమె పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు (Police registered a case).. అన్ని కోణాల్లో విచార‌ణ జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె వాంగ్మూలం సేకరించ‌గా పొంత‌న లేని స‌మాధానాలు చెప్ప‌డంతో ఆమెపై అనుమానాలు వ‌చ్చాయి.

    Pune | ల‌భ్యం కానీ ఆధారాలు

    కెమిక‌ల్‌ స్ప్రే (chemical spray) చేసి తాను స్పృహ కోల్పోయిన‌ట్లు చేశాడ‌ని బాధితురాలు చెప్పడంతో పోలీసులు నిపుణుల‌ను ర‌ప్పించారు. వారు వ‌చ్చి ఆధారాల కోసం య‌త్నించ‌గా ఎలాంటి ర‌సాయ‌న ఆన‌వాళ్లు ల‌భించ‌లేదు. మ‌రోవైపు, త‌న ఇంట్లోకి దుండ‌గుడు వ‌చ్చాడ‌ని చెప్ప‌డంతో పోలీసులు స‌మీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు ప‌రిశీలించ‌గా, కొత్త వ్యక్తులు ఎవ‌రూ రాలేద‌ని తేలింది. దీంతో బాధితురాలిని లోతుగా విచారించ‌గా, అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. ఎలాంటి అత్యాచారం జ‌రుగ‌లేద‌ని, బాధితురాలు పోలీసుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌నింద‌ని క‌మిష‌న‌ర్ కుమార్ (Police Commissioner Amitesh Kumar) తెలిపారు. మహిళ మానసిక ఆరోగ్యం బాగలేద‌న్నారు.

    READ ALSO  Army Officer | ఒక సరిహద్దు.. ముగ్గురు శత్రువులు.. వాళ్లు ఒక్కటవుతుండడం ఆందోళనకరమన్న ఆర్మీ అధికారి

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....