అక్షరటుడే, వెబ్డెస్క్: Asim Munir | అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్కు(Pakistan Army Chief Asim Munir) తీవ్ర పరాభవం ఎదురైంది. అగ్రరాజ్యంలో సొంత దేశస్తుల నుంచే నిరసన ఎదురైంది. వాషింగ్టన్(Washington)లో బస చేస్తున్న హోటల్ ఎదుట కొందరు పాకిస్తానీయులు ఆందోళనకు దిగారు. మునీర్ హంతకుడని, పిరికివాడని, నియంత అని నినాదాలు చేశారు. పాకిస్తాన్ లో మునీర్ ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం ఉండదని, వేలాది మంది పాక్ ప్రజల మరణాలకు ఆయనే కారణమని మండిపడ్డారు. దేశంలో తుపాకులు మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం చనిపోతుందంటూ నినాదాలు చేశారు.
Asim Munir | మునీర్కు వ్యతిరేకంగా..
వ్యూహాత్మక పర్యటన కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) అమెరికాలో పర్యటిస్తున్నారు. అగ్రరాజ్యంతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఆయన వాషింగ్టన్ చేరుకున్నారు. అయితే, అమెరికాలో ఆయనకు పాక్ పౌరుల నుంచే నిరసన సెగ తగిలింది. ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పార్టీ పీటీఐకి చెందిన కార్యకర్తలు మునీర్ బస చేసిన హోటల్ వెలుపల నిరసనలు చేపట్టారు. “అసిమ్ మునీర్, మీ సమయం ముగిసింది. పాకిస్తాన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని” నినాదాలు చేశారు. “అసిమ్ మునీర్, నువ్వు దాక్కోవచ్చు, నువ్వు రెండవ బేస్మెంట్లో కింద ఉన్నావు. నిన్ను వేటాడేందుకు జనాలు ఇక్కడ ఉన్నారు” అని పేర్కొన్నారు.