అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan | పాకిస్తాన్ ప్రభుత్వానికి(Pakistan government) షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఆ దేశంలో అంతర్గత భద్రతనే సరిగ్గా చూసుకోలేని పాక్ భారత్(India)పై మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇటీవల బలూచిస్తాన్(Balochistan)లో కీలక నగరాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తమ దేశంలో ఓ నగరాన్ని కాపాడులేక పాక్ ఆర్మీ(Pakistan Army) చేతులు ఎత్తేసింది. తాజాగా ఆ దేశంలోని ఓ జైలు నుంచి భారీగా ఖైదీలు పరారయ్యారు. కరాచీలోని మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకున్నారు.
Pakistan | జైలులో ఘర్షణ
మాలిర్ జైలు(Malir Jail)లో పోలీసులు, ఖైదీలకు మధ్య సోమవారం అర్ధరాత్రి భారీ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం ఖైదీలు(Prisoners) తప్పించుకున్నారు. ఖైదీల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డట్లు సమాచారం. కాగా తప్పించుకున ఖైదీలందరూ తీవ్రమైన నేరాల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు(Police) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది ఖైదీలు మృతి చెందారు.