అక్షరటుడే, ఇందూరు: Deo Ashok | నిజామాబాద్ నార్త్ మండలంలోని ఇస్లాంపురాలో ఉన్న ప్రైమ్ ద స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సీలో (Prime The School of Excellence) ఉన్నత తరగతులకు (8 నుంచి 10వ తరగతి) ప్రభుత్వ అనుమతి లేదని నిజామాబాద్ డీఈవో అశోక్ తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఏ పాఠశాలల్లోనైనా ప్రభుత్వ అనుమతి ఉంటేనే తమ పిల్లల్ని చదివించాలని సూచించారు. కాగా.. నిజామాబాద్ నగరంలోని పలు పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రవేశాలు చేపట్టాయి. ఇలాంటి పాఠశాలల్లో అడ్మిషన్లు చేపట్టవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈవో సూచించారు.