అక్షరటుడే, వెబ్డెస్క్:PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం గుజరాత్ చేరుకున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా వడోదరలో రోడ్ షో(Road show) నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) అనంతరం తొలిసారి గుజరాత్లో పర్యటిస్తున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. త్రివర్ణపతాకాలతో వడోదర ప్రజలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. 30వేల మంది మహిళలు పూలు చల్లుతూ మోదీని ఆహ్వానించారు.
PM Modi | ప్రత్యేకంగా కల్నల్ సోఫియా కుటుంబం
ఆపరేషన్ సిందూర్ అనంతరం ఆ వివరాలను విదేశాంగ కార్యదర్శితో పాటు కల్నల్ సోఫియా ఖురేషి(Colonel Sophia Qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్(Wing Commander Vyomika Singh) మీడియాకు వెల్లడించారు. అయితే సోఫియా కుటుంబం వడోదరలో స్థిర పడింది. మోదీ రోడ్ షో సందర్భంగా సోఫియా కుటుంబ సభ్యులు ప్రధాని మోదీపై పూలవర్షం కురిపించారు.
PM Modi | రూ.77 వేల కోట్ల ప్రాజెక్టులు
ప్రధాని మోదీ వడోదర(Vadodara) పర్యటనలో భాగంగా రూ.77 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. రైలు ఇంజిన్ల తయారీ కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ రైలు ఇంజిన్(Electric Train Engine)ను మోదీ ప్రారంభించారు. మంగళవారం కూడా మోదీ గుజరాత్లో పర్యటించనున్నారు.