అక్షరటుడే, వెబ్డెస్క్ :PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6న జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లో పర్యటించనున్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఆయన జమ్మూ కశ్మీర్ వెళ్లలేదు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత్లోని వివిధ వేదికల నుంచి పాక్(Pakistan)కు, ఉగ్రవాదులకు మోదీ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ వెళ్లలేదు. ఈ క్రమంలో 6న ఆయన అక్కడ పర్యటించనున్నారు.
చీనాబ్ రైల్వే బ్రిడ్జి(Chenab Railway Bridge)ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం మోదీకి ఇది జమ్మూకశ్మీర్కు తొలిసారి పర్యటన కావడంతో ఆసక్తి నెలకొంది. ఉగ్రవాదం అణచివేతపై ప్రధాని కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఉగ్రవాదం(Terrorism) అంతమే తమ లక్ష్యమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.