అక్షరటుడే, వెబ్డెస్క్:PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు రానున్నారు. ఏపీ రాజధాని అమరావతి(Amaravati capital)లో ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు.
PM Modi | పోలీసుల పహారాలో గన్నవరం ఎయిర్పోర్ట్
ప్రధాని మోదీ pm modi మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు(Gannavaram Airport)కు చేరుకుంటారు. దీంతో ఎయిర్పోర్ట్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కార్గో సర్వీస్(Cargo service)లను నిలిపివేశారు. ప్రధాన గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. విమాన టికెట్ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. విమానాశ్రయానికి (Gannavaram Airport) వెళ్లే మార్గంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
PM Modi | ప్రధాని షెడ్యూల్ ఇలా..
మోదీ narendra modi మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం(Gannavaram)లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్లో వెలగపూడి సభ(Velagapudi Sabha) ప్రాంగణానికి చేరుకుంటారు. అమరావతిలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. విశాఖలో Vizag నిర్మించనున్న యూనిట్ మాల్(unit Mall Vizag)కు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. మళ్లీ హెలిక్యాప్టర్లో 4:55 గన్నవరం చేరుకొని, అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.