అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)లో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా జూన్ 21న ఆయన విశాఖలో పర్యటిస్తారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు అణువణువు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బీచ్రోడ్లో మంగళవారం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేవల్ కోస్ట్ నుంచి పార్క్ హోటల్ వరకు రెడ్జోన్ ప్రకటించారు. ఈనెల 21 వరకు 5 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం కూడా విధించారు. 21 వరకు ఆర్కే బీచ్ రోడ్డు(RK Beach Road) మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
PM Modi | ప్రధాని షెడ్యూల్ ఇదే..
ప్రధాని మోదీ(PM Modi) విశాఖ ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకుంటారు. రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేస్తారు. 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 గంటల వరకు విశాఖ బీచ్(Visakhapatnam Beach)లో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం(AP Government) ఏర్పాట్లు చేస్తోంది.