అక్షరటుడే, వెబ్డెస్క్: PM modi | పీవోకేపై ప్రధాని మోదీ (prime minister modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పీవోకును భారత్కు అప్పగించడం తప్ప.. పాకిస్తాన్కు (pakistan) గత్యంతరం లేదన్నారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. ఉగ్రవాదులను (terrorist) అప్పగించే వాళ్లు మాట్లాడితేనే మేం మాట్లాడతామని స్పష్టం చేశారు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని పేర్కొన్నారు. పీవోకేను అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్ చేయడంపైనే చర్చలు ఉంటాయన్నారు. పాక్ దాడులకు గట్టి బదులివ్వాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. పాక్ ఒక్క తూటా కాలిస్తే.. క్షిపణితో దాడి చేయాలన్నారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.