More
    Homeఆంధ్రప్రదేశ్​Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోడీ సమీక్ష.. హాజరుకానున్న రేవంత్​, చంద్రబాబు

    Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోడీ సమీక్ష.. హాజరుకానున్న రేవంత్​, చంద్రబాబు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Polavaram project : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) పోలవరంపై దృష్టి సారించినట్లు తెలిసింది. జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోలవరం ప్రాజెక్టుపై మే 28న ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఒడిశా(Odisha), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సీఎంలతో మాట్లాడనున్నట్లు తెలిసింది.

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని ప్రధాని తొలిసారి సమీక్షించబోతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

    READ ALSO  Gandhi Grand Daugter | మోసం కేసు.. గాంధీజి మునిమ‌న‌వ‌రాలికి ఏడేళ్ల జైలు శిక్ష‌

    2027 నాటికి పోలవరం జలాశయ నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కాగా, పోలవరం బ్యాక్ వాటర్​తో ఏర్పడే ముంపుపై తెలంగాణ ఆందోళన లేవనెత్తుతోంది. ఇదే విషయాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ(Ministry of Jal Shakti), కేంద్ర జల సంఘం(Central Water Commission) దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సైతం ఆందోళన వ్యక్తం చేశాయి.

    ఈ మేరకు నాలుగు రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన, పనుల పురోగతిని ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. గడువులోగా పనులు పూర్తి చేయడంపై ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడుతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....