అక్షరటుడే, వెబ్డెస్క్: Pm modi | ప్రధాని నరేంద్ర మోదీ(Prime minister modi) జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్(Operation sindoor), అనంతర పరిణామాల తర్వాత తొలిసారి.. రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రతిరోజూ ప్రధాని దగ్గరుండి పర్యవేక్షించారు.
మూడు రోజుల పాటు భారత్ – పాక్ మధ్య తీవ్రమైన దాడులు కొనసాగిన విషయం తెలిసిందే. చివరికి రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో నేడు సాయంత్రం 5 గంటలకు రెండు దేశాల మధ్య చర్చలు జరుగున్నాయి. కాగా.. రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడనుండడంతో ఆయన చెబుతారని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.