ePaper
More
    Homeఅంతర్జాతీయంPM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ట్రినిడాడ్ & టొబాగో అత్యున్నత పౌర...

    PM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ట్రినిడాడ్ & టొబాగో అత్యున్నత పౌర పురస్కారం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి అరుదైన గౌరవం లభించింది. ట్రినిడాడ్ & టొబాగో (Trinidad & Tobago) అత్యున్నత పౌర పురస్కారం వరించింది. కరేబియన్ దేశం (Caribbean country) సందర్శనలో ఉన్న మోదీకి శుక్రవారం(జులై 4) ట్రినిడాడ్ & టొబాగో యొక్క అత్యున్నత పురస్కారం లభించింది.

    ప్రపంచ నాయకత్వం, భారతీయ ప్రవాసులతో చురుకైన సంబంధం, కొవిడ్ టైంలో మానవతావాద సహకారం.. తదితరాలను గుర్తించి, మోడీకి “ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ & టొబాగో” “The Order of the Republic of Trinidad & Tobago” ప్రదానం చేశారు. ఇలా ఒక విదేశీ నేతకు ఆ దేశం ఈ పురస్కారం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

    READ ALSO  Rajasthan | రూ.135 కోట్లతో ఫ్లైఓవర్​ నిర్మాణం.. ఒక్క వర్షానికి కుంగిన వైనం

    PM MODI | ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఏమన్నారంటే..

    “140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని నేను స్వీకరిస్తున్నా..” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్​ ట్రినిడాడ్ & టొబాగో మధ్య బలమైన స్నేహాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ పురస్కారాన్ని విలువలు, చరిత్ర, సాంస్కృతిక సంబంధాల ప్రతిబింబంగా వర్ణించారు.

    PM MODI | చారిత్రాత్మక పర్యటన..

    ట్రినిడాడ్ & టొబాగోలో ప్రధానమంత్రి మోదీకి ఇది మొదటి పర్యటన. 1999 తర్వాత ఆ దేశానికి భారత ప్రధానమంత్రి చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా భారత్​ ప్రైమ్​ మినిస్టర్​ మోదీకి ఈ అవార్డును ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేసర్ (Prime Minister Kamla Persad-Bissessar) ప్రకటించారు.

    READ ALSO  Bharat Bandh | రేపు కార్మిక సంఘాల భార‌త్‌బంద్‌.. స‌మ్మెలో పాల్గొన‌నున్న 25 కోట్ల మంది కార్మికులు..

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....