అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం సైప్రస్ (Cyprus) దేశానికి చేరుకున్నారు. ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సైప్రస్ చేరుకోగా.. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కాగా 23 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం గమనార్హం.
సైప్రస్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కెనడా వెళ్తారు. ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు జూన్ 16, 17 తేదీల్లో జరిగే జీ–7 సదస్సులో (G-7 Summit) పాల్గొంటారు. అనంతరం తిరుగు ప్రయాణంలో క్రొయేషియాను కూడా సందర్శిస్తారు.
PM Modi | ప్రధాని మోదీని కలిసిన వ్యక్తి ఆనందం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దేశంలో చాలా మంది అభిమానులు ఉంటారు. ప్రవాసుల్లో కూడా మోదీ అభిమానులు భారీగానే ఉంటారు. ఈ క్రమంలో సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని లిమాసోల్ నగరంలో నరేందర్ అనే వ్యక్తి కలిశాడు. ప్రధాని అక్కడ ప్రవాసులతో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మోదీని కవగా ఆయన కుమార్తెను ఆశీర్వాదించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. “మోదీ నా కుమార్తెను ఆశీర్వాదించారు. మేము సంతోషంగా ఉన్నాము. ఇది మాకు జీవితంలో ఒకసారి లభించే అవకాశం” అని అన్నారు.