అక్షరటుడే, ఇందూరు: GOPA | చదువులో ఉత్తమ ప్రతిభ చూపిన గౌడ విద్యార్థులకు ‘గోపా’ (Goud Officials & Professionals Association) ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పదో తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన వాళ్లు, ఇంటర్లో 900పైగా మార్కులు సాధించిన విద్యార్థులు పురస్కారాలకు అర్హులని వివరించారు.
ఈనెల 15న నగరంలోని అంబేడ్కర్ భవన్లో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమ మార్కుల మెమో, ఆధార్కార్డు, జిరాక్స్ కాపీలను నిజామాబాద్లో ఎం.వెంకటేశ్వర్ గౌడ్ (9440768910), రవీందర్ గౌడ్ (9866413250), టి.సోమలింగం గౌడ్ (9440502363), హెచ్.లక్ష్మణ్ గౌడ్ (8341631163), ఆర్మూర్లో లింబాగౌడ్ టీచర్ (9491313699), రాజేశ్వర్ గౌడ్ (9912469820)లను వాట్సప్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమానికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారయ్య గౌడ్, చక్రవర్తి గౌడ్ హాజరవుతారని పేర్కొన్నారు.