అక్షరటుడే,ఇందూరు:Prajavani | ప్రజావాణి(Prajavani) కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్(Additional Collectors Ankit), కిరణ్ కుమార్(Kiran Kumar) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్(District Collectorate)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమానికి 117 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతో పాటు జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఇంచార్జి ఆర్డీవో స్రవంతిలకు అర్జీలు సమర్పించారు.
