అక్షరటుడే, వెబ్డెస్క్ : Ponnam Prabhakar | రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఆర్టీసీ బస్సులో rtc bus ప్రయాణించారు.
సిద్దిపేట siddipeta జిల్లా దుద్దేడ టోల్ గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ karimnangar డిపో ఆర్టీసీ బస్సులో ఆయన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం mahalaxmi scheme ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ఆయన ఆరాతీశారు. బస్సు డ్రైవర్, కండక్టర్తో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ్మెపై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.