అక్షరటుడే, వెబ్డెస్క్ : Bharat Summit | ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ rahul gandhi అన్నారు. పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. హైదరాబాద్ hyderabadలో నిర్వహించిన భారత్ సమ్మిట్ Bharat Summit కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్టులో సీఎం రేవంత్రెడ్డి cm revanth reddy, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క bhatti vikramarka ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా హైటెక్ సిటీలో భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్న ప్రాంతానికి ఆయన చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక మాధ్యమాలతో రాజకీయాలు మారిపోయాయని, కొత్త తరం పాలిటిక్స్లో రావాలని అభిప్రాయ పడ్డారు. అప్పుడే కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి, దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. అయితే రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్లో శుక్రవారమే పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన కశ్మీర్లో ఉగ్రదాడి బాధితులను పరామర్శించడానికి వెళ్లడంతో శనివారం వచ్చారు. ఈ సమ్మిట్ నిర్వహించిన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.