అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు తమ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలో (CP Office) జోన్–2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్–2025ను (Police Duty Meet) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సైన్స్ను ఇన్వెస్టిగేషన్ టూల్స్గా మార్చుకునేందుకు పోలీసులు తమను తాము మెరుగుపర్చుకోవాలని సూచించారు. పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం ద్వారా పనిలో పోటీతత్వం పెరుగుతుందన్నారు. ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయని పేర్కొన్నారు.
CP Sai Chaitanya | మూడురోజుల పాటు పోటీలు..
పోలీస్ డ్యూటీ మీట్-2025లో నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్ పోలీసు అధికారులకు సిబ్బందికి పోటీలు నిర్వహించారు. సైంటిఫిక్, ఫింగర్ ప్రింట్(Finger print), ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ (Forensic Investigation), కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్స్(Dog squads), ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, ఎక్స్ప్లోజివ్వ్, నార్కోటిక్, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు.
ఈ ఎంపికలు మూడు రోజులపాటు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన వారికి రాష్ట్రస్థాయిలో జరిగే డ్యూటీ మీట్కు పంపుతామని సీపీ తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి(DCP (Admin) Baswareddy), అదనపు డీసీపీ (ఏఆర్) రామ్ చందర్ రావు, సీసీఎస్ ఏసీపీ నాగవేంద్ర చారి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొన్న అధికారులు