అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: Constable Suspension | వడ్డీ వ్యాపారుల విషయంలో నిజామాబాద్ సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ ప్రత్యేకించి పోలీసులు వడ్డీ దందాలు నిర్వహిస్తే ఏమాత్రం సహించడం లేదు. ప్రత్యేకంగా క్రిమినల్ కేసులు నమోదు చేయించడమే కాకుండా సస్పెండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కమిషనరేట్లో మరో కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. మెండోరా పోలీస్ స్టేషన్లో (Mendora Police Station) విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గంగాధర్ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో (Nizamabad Rural Police Station) రెండు కేసులు నమోదయ్యాయి. అనంతరం విచారణ చేపట్టారు. నివేదిక అందిన తదుపరి తాజాగా సీపీ చర్యలు తీసుకున్నారు. సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
కాగా.. గడిచిన రెండు నెలల వ్యవధిలో కమిషనరేట్ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో ఇద్దరు వడ్డీ వ్యాపారం నిర్వహించే వారు కాగా.. ఒకరు ఉద్యోగాల పేరిట డబ్బుల వసూలుకు పాల్పడినట్లు తెలుస్తోంది.