అక్షరటుడే, హైదరాబాద్: Health Minister : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)ను శుక్రవారం హైదరాబాద్ (Hyderabad)లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ (Rajiv Arogya Sri Healthcare Trust) కార్యాలయంలో MLC, ప్రొఫెసర్ కోదండరాం (MLC, Professor Kodandaram) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర RMP & PMP అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు.
RMP, PMPలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రిని కలిసిన వారిలో విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్, M.HI.రాజేందర్ రెడ్డి, RMP, PMP అసోసియేషన్ ప్రతినిధులు బాల బ్రహ్మచారి, జి.బాలరాజు, పుల్గం మోహన్, చంద్రం ఉన్నారు.