అక్షరటుడే, న్యూఢిల్లీ: Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను మోడీ విడుదల చేశారు.
ఈ జూన్ 21న మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోనున్నామని పీఎం తెలిపారు. ఈ చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
గత దశాబ్ద కాలంగా దేశ ప్రజలు ఈ గొప్ప వేడుకకు అందిస్తున్న ఆదరణ ప్రత్యేకమైనదని మోడీ పేర్కొన్నారు. గత పదేళ్లుగా యోగా కేవలం భారత్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం మనందరికీ గర్వకారణమని అన్నారు.