అక్షరటుడే, ఇందూరు: BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ అన్నారు. శనివారం నగరంలోని నాందేవ్వాడలో రచ్చబండ (Racha banda) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలను నిజం చేస్తూ ప్రధాని మోదీ (PM Modi) గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ, జిల్లా నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, సందీప్, సాయిరాం, రాజు, ప్రతాప్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
