అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ PM Modi మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి Amaravati కి రానున్నారు. అమరావతిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భద్రత కట్టుదిట్టం చేసింది. మరోవైపు ఎస్పీజీ SPG కమాండోలు సైతం అమరావతికి చేరుకున్నారు. మోదీ భద్రతా దళం ఆయన పర్యటించే ప్రాంతాలను పరిశీలిస్తోంది. రాష్ట్ర పోలీసులతో భద్రతా ఏర్పాట్లపై వారు చర్చించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Chandra Babu nayudu సైతం ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రులు, అధికారులతో కమిటీలు వేసి.. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు..
PM Modi | ప్రధాని పర్యటన షెడ్యూల్..
మే 2వ తేదీన తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.40 గంటలకు బయల్దేరి ప్రధాని మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతికి వస్తారు. 3.30 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని.. అక్కడి నుంచి సాయంత్రం 5.20 గంటలకు ఢిల్లీకి పయనం అవుతారు.