More
    HomeజాతీయంAhmedabad Plane Crash | విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

    Ahmedabad Plane Crash | విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదం యావత్​ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India plane) టేకాఫ్​ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 265 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం అహ్మదాబాద్​ వచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీశారు. అధికారులతో మాట్లాడారు.

    Ahmedabad Plane Crash | క్షతగాత్రులకు పరామర్శ

    ప్రధాని మోదీ విమాన ప్రమాదం స్థలాన్ని పరిశీలించిన అనంతరం అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రి (Ahmedabad Civil Hospital)కి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన వారు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ప్రధాని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా.. విమాన ప్రమాదంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్​ గేట్​ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డ రమేశ్​ విశ్వాస్​ కుమార్​తో మోదీ మాట్లాడారు. ఆయన వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌(Gujarat CM Bhupendra Patel), కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Minister Rammohan Naidu) తదితరులు ఉన్నారు.

    READ ALSO  DNA Test | విమాన ప్రమాద మృతుల గుర్తింపులో కీలకంగా మారిన డీఎన్​ఏ టెస్ట్..​ అసలు ఈ పరీక్ష ఏంటి.. ఎలా చేస్తారో తెలుసా..!

    Ahmedabad Plane Crash | నేడు అహ్మదాబాద్​కు బ్రిటిష్​ అధికారులు

    విమాన ప్రమాదంలో 53 మంది యూకే పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రిటిష్​ హైకమిషనర్​ అధికారులు(British High Commission Officers) కూడా అహ్మదాబాద్ చేరుకొని పరిశీలించనున్నారు. ప్రమాద వివరాలను వారు తెలుసుకోనున్నారు. మరోవైపు ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం అధికారులు గాలిస్తున్నారు.

    Ahmedabad Plane Crash | మొత్తం 265 మంది మృతి

    విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానంలో 242 మంది ఉండగా.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే విమానం మెడికల్​ కాలేజీ హాస్టల్​(Medical College Hostel)పై కూలడంతో అందులోని 24 మంది చనిపోయారు.

    READ ALSO  Israel - Iran | 200 యుద్ధ విమానాలతో దాడి చేసిన ఇజ్రాయెల్

    Ahmedabad Plane Crash | మృతదేహాల అప్పగింత కోసం డీఎన్​ఏ పరీక్షలు

    విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అప్పగించడానికి అధికారులు డీఎన్​ఏ పరీక్షలు(DNA Tests) చేస్తున్నారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు అహ్మదాబాద్​ సివిల్​ ఆస్పత్రిలో నిరీక్షిస్తున్నారు. బాధిత కుటుంబాల పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారికి ఆహారం అందించడంతో పాటు, వసతులు కల్పిస్తున్నారు.

    Latest articles

    Kamareddy | గంజ్‌ గేటు వద్ద గుంత.. వాహనదారులకు చింత

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని గంజ్‌ రెండో గేటు వద్ద గుంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు లోనికి...

    Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో రూ.50 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో హైదరాబాద్ (Hyderabad)​కు చెందిన ఓ యువకుడు రూ.50...

    Bheemgal | ఎస్సై కొట్టాడంటూ.. సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bheemgal | భీమ్​గల్​ ఎస్సై, కానిస్టేబుళ్లు తనను కొట్టారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రం కేంద్రంలోని...

    Israel | ఇజ్రాయెల్​ ప్రధాని కొడుకు పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel | ఇరాన్​– ఇజ్రాయెల్​ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు...

    More like this

    Kamareddy | గంజ్‌ గేటు వద్ద గుంత.. వాహనదారులకు చింత

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని గంజ్‌ రెండో గేటు వద్ద గుంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు లోనికి...

    Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో రూ.50 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో హైదరాబాద్ (Hyderabad)​కు చెందిన ఓ యువకుడు రూ.50...

    Bheemgal | ఎస్సై కొట్టాడంటూ.. సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bheemgal | భీమ్​గల్​ ఎస్సై, కానిస్టేబుళ్లు తనను కొట్టారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రం కేంద్రంలోని...