అక్షరటుడే, వెబ్డెస్క్: Plane crash | గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ కూలిపోయింది.
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు (Ahmedabad airport) నుంచి గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు 200 మందికిపైగా ప్రయాణికులతో లండన్కు ఫైట్ టేకాఫ్ అయ్యింది. ఈ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్ ఇండియా విమానం (Air India plane) నేలకూలింది. మెగాని నగర్లోని షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో విమానంలో సుమారు 200 మందికి పైగా ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. 12 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నాయి.