అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Arvind | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఎంపీ అర్వింద్తో పాటు, బీజేపీ నేత జితేందర్రెడ్డి (Jitender Reddy) ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(FSL) రిపోర్ట్ పేర్కొంది. అంతేగాకుండా వాళ్ల అనుచరులకు చెందిన 200 మంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఎఫ్ఎస్ఎల్ తెలిపింది.
ఎఫ్ఎస్ఎల్ నివేదికపై (FSL report) స్పందిస్తూ ఎంపీ అర్వింద్ కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ను (Bandi Sanjay) కోరారు. ఈ విషయమై తాను లోక్సభ స్పీకర్, కేంద్ర హోం మంత్రికి కూడా లేఖ రాస్తానని వెల్లడించారు.
MP Arvind | సీఎంపై సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో (phone tapping case) రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం లేదని ఎంపీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కేసీఆర్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీంతో ఈ కేసులో నేరస్తులపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువ అన్నారు. అందుకే కేంద్ర సంస్థతో విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.