అక్షరటుడే, వెబ్డెస్క్ : Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar rao) ఎట్టకేలకు హైదరాబాద్ (Hyderabad) వచ్చారు.
గత మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case ) నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయాడు. విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు ఇటీవల ఊరట కల్పించడంతో ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
సోమవారం సిట్ అధికారుల ఎదుట ప్రభాకర్రావు విచారణకు హాజరు కానున్నారు. కాగా.. విచారణలో భాగంగా ఆయన చెప్పే విషయాలు కీలకంగా మారనున్నాయి. గత ప్రభుత్వ పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.