అక్షరటుడే, ఇందల్వాయి: Bhubarathi | భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో రైతులు రైతువేదికలను ఆశ్రయిస్తున్నారు. రైతులు ఉదయం 9 గంటల నుంచే రైతువేదికల వద్ద క్యూ కడుతున్నారు. ఇందల్వాయి (Indalwai) రైతు వేదిక వద్ద బుధవారం సందడి నెలకొంది. రైతుల భూ సమస్యలకు భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కరిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. 20వ తేదీలోపు రైతులు వేదికల వద్ద దరఖాస్తు చేసుకోవాలని ఏవో శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Bhubarathi | భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం
అక్షరటుడే, కోటగిరి : భూభారతి ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పోతంగల్ తహశీల్దార్ గంగాధర్ అన్నారు. పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతి, రెవెన్యూ సదస్సు అమలులో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్వోఆర్ కొత్తచట్టంలోని (ROR Act) లాభాలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, గంధం పవన్, గంగాధర్ పటేల్, విఠల్, తదితరులు పాల్గొన్నారు.
