ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై పీడీయాక్ట్​

    SP Rajesh Chandra | అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై పీడీయాక్ట్​

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | దారిదోపిడీలు, చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై ఎస్పీ రాజేష్​ చంద్ర ఉక్కుపాదం మోపారు. ముఠాలో ఉన్న నలుగురు సభ్యులపై పీడీయాక్ట్​ నమోదు చేశారు. నిజామాబాద్(Nizamabad) జిల్లా జైలులో ఉన్న నిందితులు చోండా అలియాస్ కూలీ పవార్, జాకీ గుజ్జియా బోస్లే, హరీష్ పవార్ అలియాస్ హర్ష, అనురాగ్ రత్నప్ప బోస్లేలకు శనివారం పీడీ యాక్ట్(PD Act)​ ఉత్తర్వులు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ముఠా 9 దారి దోపిడీలు, చోరీలకు పాల్పడిందన్నారు.

    SP Rajesh Chandra | ఆగి ఉన్న వాహనాలపై దాడులు..

    నిందితులు రోడ్డు పక్కన ఆగిఉన్న వాహనాలపై దాడిచేసి, వాహనాల అద్దాలు పగులగొట్టి వాహనదారులపై కత్తులతో దాడి చేసేవారని ఎస్పీ తెలిపారు. వాహనదారులను బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు, విలువైన వస్తువులను, మొబైల్ ఫోన్లు (Mobile Phones) ఎత్తుకెళ్లేవారని.. రోడ్డు పక్కన ఉండే ఇళ్లల్లో సైతం చోరీలకు పాల్పడేవారని పేర్కొన్నారు. నిందితుల నేరపూరిత చర్యల ద్వారా ప్రజలలో భయాందోళనలు కలుగజేస్తూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగజేస్తున్నారని తెలిపారు. దీంతో వీరిపై పీడీ యాక్టు ప్రయోగించడం జరిగిందన్నారు. ఈ యాక్టుతో నిoదితులు ఒక ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగజేస్తే పూర్తిగా జైలు జీవితానికి పరిమితమయ్యే అవకాశం ఉందన్నారు.

    READ ALSO  Banswada Congress | కాంగ్రెస్​ కార్యకర్తలు హైదరాబాద్​కు తరలిరావాలి

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....