అక్షరటుడే, వెబ్డెస్క్: PCC Chief | ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ను మంగళవారం సిట్ అధికారులు(Sit Officers) రికార్డు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో సీఎం రేవంత్(CM Revanth) సహా 650 మందికిపైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయని తెలిపారు.రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
PCC Chief | మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ఫోన్లు ట్యాప్
మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారని మహేశ్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. మా ఫోన్లు ట్యాప్ అయినట్లు అనుమానం రావడంతో గతంలో ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. వేల మంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణమని ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్(Minister KTR)లు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్షార్హులని పేర్కొన్నారు.