అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్:Nizamabad City | నగరంలో అర్ధరాత్రి వరకు పాన్షాప్(Pawnshop) తెరిచి ఉంచిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పనిచ్చింది.
నిజామాబాద్ ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి(1 Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాలపల్లి(Malapally)లో సాఫ్రాన్ పాన్షాప్ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన యజమాని ఇంతియాజ్ అహ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate) ఎదుట హాజరుపర్చగా అతడికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్హెచ్వో తెలిపారు. ఎవరైనా అర్ధరాత్రి వరకు పాన్షాప్లు, హోటళ్లు తెరిచి ఉంచితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.