అక్షరటుడే, బాన్సువాడ: Banswada | వర్షాకాలంలో రోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ (District Medical and health Officer Chandrashekhar) అన్నారు. శుక్రవారం బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Birkoor Primary Health Center) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ల్యాబ్, ఫార్మసీ గది, స్టోర్ రూమ్ తదితర వాటిని పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీలేఖ, గిరీష్, సీహెచ్వో రవీందర్, దయానంద్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.