అక్షరటుడే, బాన్సువాడ: Banswada | అనుమానాస్పద స్థితిలో పార్ట్టైం లెక్చరర్ మృతి చెందింది. ఈ ఘటన నుస్రుల్లాబాద్ (Nasrullabad) మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మోర్తాడ్ (Morthad) మండలం గాండ్లపేట గ్రామానికి (Gandlapet) చెందిన స్వప్న(34) నస్రుల్లాబాద్ మండలం దుర్కిలోని గిరిజన గురుకుల పాఠశాల\కళాశాలలో (Tribal Gurukul School/college) పార్ట్ టైం లెక్చరర్గా మూడేళ్లుగా పనిచేస్తోంది.
శుక్రవారం ఉదయం కోదాడలో టెట్ ఎగ్జామ్ (TET Exam) రాసి వచ్చి కళాశాలలో రాత్రి నైట్డ్యూటీ చేసింది. అనంతరం రాత్రి పిల్లలతో కలిసి నిద్రించి ఉదయం లేవలేదు. దీంతో విద్యార్థినులు ప్రిన్సిపల్కు సమాచారం ఇచ్చారు. బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.