ePaper
More
    HomeజాతీయంParliament sessions | నెల రోజుల పాటు పార్లమెంట్​ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చకు సిద్ధం

    Parliament sessions | నెల రోజుల పాటు పార్లమెంట్​ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చకు సిద్ధం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parliament sessions | పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహించనుంది. జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు​ (Union Minister Kiren Rijiju) ‘ఎక్స్’​ వేదికగా ప్రకటించారు. సెలవు దినాల్లో సమావేశాలు ఉండవు. దీనికి తోడు స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో కూడా సమావేశాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

    Parliament sessions | కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం

    జమ్మూ కశ్మీర్​లోని (Jammu and Kashmir) పహల్గామ్​లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి (terrorists attacked) చేశారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor) చేపట్టి ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్​కు బుద్ధి చెప్పింది. అయితే పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam terror attack), ఆపరేషన్​ సిందూర్​ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో వాటిపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.

    READ ALSO  Himachal Pradesh | హిమాచల్​ ప్రదేశ్​లో వర్ష బీభత్సం.. 18 మంది మృతి

    భారత్​, పాక్​ (India – Pakistan) మధ్య తాను యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిని సభలో లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad plane crash) గురించి కూడా సభలో చర్చించే ఛాన్స్​ ఉంది.

    Parliament sessions | బీసీ రిజర్వేషన్​ బిల్లులు ఆమోదిస్తారా..

    రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress government) ప్రకటించింది. ఈ మేరకు స్థానిక ఎనికలతో (local elections) పాటు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించింది. వీటిని కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదిస్తేనే ఈ బిల్లులు చట్టం రూపం దాల్చనున్నాయి. వర్షాకాల సమావేశంలో ఈ బిల్లులను ఆమోదిస్తే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు (BC reservations) అవకాశం ఉంటుంది. సెప్టెంబర్​ 30లోపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను కేంద్రం ఆమోదిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

    READ ALSO  Bihar | కుటుంబాన్ని బ‌లిగొన్న మూఢ న‌మ్మ‌కం.. చేతబ‌డి నెపంతో ఐదుగురి హత్య

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....