అక్షరటుడే, వెబ్డెస్క్ :Parliament session | పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముహూర్తం ఖరారు అయింది. సమావేశాలకు సంబంధించిన తేదీలను కేంద్ర ప్రభుత్వం(Central Government) వెల్లడించింది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Minister Kiren Rijiju) ప్రకటించారు. కాగా ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత జరగనున్న సమావేశాలు కావడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.
