అక్షరటుడే, వెబ్డెస్క్: ACB | రాష్ట్రంలో ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. నిత్యం ఒకరిద్దరు అవినీతి అధికారులు (Anti-Corruption Department officials) అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్నారు. అయినా అవినీతి అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. లంచాలకు మరిగిన అధికారులు ప్రజల వద్ద ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.
తాజాగా.. పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) మునిపల్లి మండలం బుధేరా గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి ఏసీబీ అధికారులకు (ACB officials) రెడ్ హ్యాండెడ్గా దొరికింది. గ్రామంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడానికి ఓ వ్యక్తి వద్ద రూ.8 వేలు డిమాండ్ చేసింది. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు.
ACB | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా 9440446106 నంబర్కు వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. లేదంటే ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) ద్వారా అవినీతి అధికారుల సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు. https://acb.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.