ePaper
More
    HomeతెలంగాణACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే ఉద్యోగుల వరకు అందరిని లంచాల పేరిట వేధిస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB raids) జరుగుతున్నా లంచాలకు మరిగిన అధికారులు కనీసం భయపడడం లేదు. కొంతమంది అధికారులైతే డబ్బులు తీసుకోవడం కూడా ఒక డ్యూటీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​ (Panchayat Raj Engineer-in-Chief) అధికారులకు దొరికాడు.

    ఓ ఉద్యోగి బదిలీ కోసం పంచాయతీ రాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​ వీరవల్లి కనకరత్నంను కలిశాడు. అయితే సదరు ఉద్యోగికి బదిలీ, పోస్టింగ్​ ఇవ్వడం కోసం ఆయన రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు (ACB officials) ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బుధవారం ఈఎన్​సీ వీరవల్లి కనకరత్నం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్​ చేశారు.

    READ ALSO  Weather Updates | రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

    ACB Trap | అందరిది అదే దారి..

    రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ఆపరేటర్​ నుంచి మొదలు పెడితే రాష్ట్రస్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. కింది స్థాయి ఉద్యోగుల ప్రజలు, కాంట్రాక్టర్లను లంచాల కోసం వేధిస్తుండగా.. పెద్ద స్థాయి అధికారులు ఉద్యోగులను లంచాలు డిమాండ్​ చేస్తున్నట్లు తాజా ఘటనతో తేలింది. పంచాయతీ రాజ్​ శాఖలో (Panchayat Raj department) కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడానికి పర్సంటేజీలు డిమాండ్​ చేస్తారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఉద్యోగి బదిలీ కోసం ఏకంగా ఇంజినీర్​ ఇన్​ చీఫ్​ లంచం తీసుకుంటూ దొరకడం ఆ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది.

    ACB Trap | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి

    ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

    READ ALSO  Governor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    Latest articles

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    KTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిధులు రాహుల్ గాంధీకి (Rahul Gandhi), నీళ్లు...

    More like this

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...