ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | రాఫెల్ జెట్ల కూల్చివేతపై పాక్ ఆరోపణలు అవాస్తవం.. స్పష్టం చేసిన డస్సాల్ట్...

    Operation Sindoor | రాఫెల్ జెట్ల కూల్చివేతపై పాక్ ఆరోపణలు అవాస్తవం.. స్పష్టం చేసిన డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాకిస్తాన్ ప్రచారాన్ని డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈవో ఎరిక్ ట్రాపియర్ (Dassault Aviation Chairman and CEO Eric Trappier) తోసిపుచ్చారు. పాక్ వాదన పూర్తిగా అసంబద్ధమని, నిరాధారమని పేర్కొన్నారు. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’తో (Operation Sindoor) ప్రారంభమైన తాజా ఇండో-పాకిస్తాన్ ఘర్షణ సమయంలో.. J-10C మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రయోగించిన PL-15E లాంగ్-రేంజ్​ క్షిపణులను ఉపయోగించి మూడు రాఫెల్స్​తో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ వైమానిక దళం పేర్కొంది. అయితే, పాక్ వాదననలను డసో ఏవియేషన్ చీఫ్ ఖండించారు. అయితే, ఇండియా ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని కోల్పోయిందని వెల్లడించారు. అది కూడా సాంకేతిక వైఫల్యం వల్లేనని స్పష్టం చేశారు.

    READ ALSO  Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఫైర్​

    Operation Sindoor | పాక్ ఆరోపణలు నిరాధారం..

    మూడు రాఫెల్ జెట్లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ వాదన పూర్తిగా తప్పని, నిరాధారమైనదని.. రాఫెల్ విమానాలను తయారు చేసే ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ అధిపతి ట్రాపియర్ తేల్చి చెప్పారు. అయితే, ఇండియా ఒక విమానం కోల్పోయిందని, అది శత్రువులతో సంబంధం లేకుండా జరిగిందని అంగీకరించారు. అధిక ఎత్తులో సాంకేతిక వైఫల్యం కారణంగా ఈ నష్టం జరిగిందని, భారతదేశం ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని (Rafale fighter jet) కోల్పోయిందని స్పష్టం చేశారు.

    ఆపరేషన్ సిందూర్ సమయంలో స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్​ఫేర్​ వ్యవస్థలు (Spectra electronic warfare systems) ఎటువంటి శత్రు కార్యకలాపాలను నమోదు చేయలేదని పేర్కొన్నారు. డస్సాల్ట్​కు పంపిన విమాన లాగ్​లు కూడా యుద్ధంలో ఎటువంటి నష్టాలను సూచించలేదన్నారు. డస్సాల్ట్ తన విమానాల ఆపరేషన్ నష్టాలను ఎప్పుడూ దాచలేదని ఆయన గుర్తు చేశారు.

    READ ALSO  America | భారత్​కు అమెరికా హెచ్చరిక..! రష్యాతో వ్యాపారం చేస్తే 500 శాతం సుంకం!

    Operation Sindoor | ఖండించిన భారత్..

    భారత్​కు చెందిన రాఫెల్ జెట్లను కూల్చివేశామని పాకిస్తాన్ చేస్తున్న అసంబద్ధ వాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. రాఫెల్ జెట్లను పాకిస్తాన్ వైమానిక దళం కూల్చివేసిందని చెప్పడం సరికాదని భారత రక్షణ కార్యదర్శి ఆర్​కే సింగ్ (Indian Defense Secretary RK Singh) అన్నారు. “మీరు రాఫెల్స్ అనే పదాన్ని బహువచనంలో ఉపయోగించారు. అది కచ్చితంగా సరైనది కాదని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఇండియా చేసిన దాడుల వల్ల పాకిస్తాన్​కు తీవ్ర నష్టం వాటిల్లింది. అది మానవ, భౌతిక పరంగా నష్టపోయింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని” అని ఆయన తేల్చి చెప్పారు.

    Operation Sindoor | రాఫెల్ వ్యతిరేక ప్రచారం వెనుక చైనా..?

    రాఫెల్​కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఫ్రాన్స్ విచారణ చేపట్టగా, దీని వెనుక చైనా ఉందని తేలింది. చైనా విదేశీ రాయబార కార్యాలయాల్లోని రక్షణ అటాచ్​లు డస్సాల్ట్ రాఫెల్ జెట్లకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశాయని ఫ్రెంచ్ నిఘా సంస్థ ఇటీవల గుర్తించింది. ప్రపంచ దేశాలు ఫ్రెంచ్ యుద్ధ విమానాలను (French fighter jets) ఎక్కువగా కొనుగోలు చేయవద్దని, బదులుగా చైనా తయారు చేసిన జెట్లను ఎంచుకోవాలని ఒప్పించడానికే ఈ ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది.

    READ ALSO  America | ఐదు నెలల్లో పది వేల మంది.. అగ్రరాజ్యంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడ్డ ఇండియన్లు

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...