అక్షరటుడే, వెబ్డెస్క్: Golden Temple | పహల్గామ్కు ప్రతీకారంగా భారత్ చేసిన దాడితో తీవ్రంగా రగిలిపోయిన పాకిస్తాన్.. అమృత్సర్(Amritsar)లోని స్వర్ణదేవాలయాన్ని(Golden Temple) టార్గెట్గా చేసుకుందని ఆర్మీ తెలిపింది.
ఈ మేరకు మే 7, 8 తేదీల్లో భారీగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నించిందని 15వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి Karthik c sheshadri సోమవారం వెల్లడించారు. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(Pakistan-occupied Kashmir)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఇండియా చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ (Pakistan) ఈ చర్యకు పాల్పడిందన్నారు. పాకిస్తాన్కు చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలు లేవని, ఇండియాలోని పౌరులతో పాటు మతపరమైన ప్రదేశాలపై దాడి చేయాలని భావించిందని ఆయన తెలిపారు.
Golden Temple | పాక్ కుట్రలు తిప్పికొట్టాం..
పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత వాయుసేనతో కలిసి తిప్పికొట్టామని శేషాద్రి తెలిపారు. “పాక్ సైన్యానికి ఎటువంటి చట్టబద్ధమైన లక్ష్యాలు లేవని తెలిసి, వారు భారత సైనిక స్థావరాలను, మతపరమైన ప్రదేశాలతో సహా పౌరులను లక్ష్యంగా చేసుకుంటారని మేము ఊహించాము. మేము ఊహించినట్లే వారు చేశారు. అందులో ప్రధానంగా స్వర్ణదేవాలయాన్ని(Golden Temple) టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడ్డారు” అని ఆయన చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని మతపరమైన ప్రదేశాలకు తగిన రక్షణ కల్పించామని శేషాద్రి వివరించారు. “స్వర్ణ దేవాలయానికి సమగ్ర వాయు రక్షణ గొడుగును అందించడానికి మేము అదనపు ఆధునిక వాయు రక్షణ ఆస్తులను సమీకరించాము” అని మేజర్ జనరల్ చెప్పారు.
Golden Temple | పూర్తి సిద్ధంగా సైన్యం..
మే 8 తెల్లవారుజామున గోల్డెన్ టెంపుల్(Golden Temple)ను టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ దాడికి పాల్పడిందని, చీకటి ముసుగులో డ్రోన్లు, లాంగ్ రేంజ్ క్షిపణులను(Long range missiles) ఉపయోగించి పెద్ద ఎత్తున వైమానిక దాడిని ప్రారంభించిందని తెలిపారు. మే 8వ తేదీ తెల్లవారుజామున, చీకటి ముసుగులో పాకిస్తాన్ మానవరహిత వైమానిక ఆయుధాలతో, ప్రధానంగా డ్రోన్లు లాంగ్ రేంజ్ క్షిపణులతో(Long range missiles) భారీ వైమానిక దాడి(Airstrike)ని నిర్వహించిందన్నారు. అప్పటికే భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని, అన్ని ముప్పులను అడ్డుకుని నాశనం చేసిందని తెలిపారు.
“మేము దీనిని ఊహించినప్పటి నుంచి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. మా ధైర్యవంతులైన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్లు పాకిస్తాన్ దుర్మార్గపు దాడిని తిప్పికొట్టారు స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్లు, క్షిపణులను కాల్చివేశారు. మన పవిత్ర స్వర్ణ దేవాలయంపై ఒక గీత కూడా పడకుండా కాపాడారు” అని మేజర్ జనరల్ శేషాద్రి వివరించారు. ఆకాష్ క్షిపణి వ్యవస్థ(Akash missile system), L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్(L-70 air defense guns) వంటి వైమానిక రక్షణ వ్యవస్థలు స్వర్ణ దేవాలయం(Golden Temple) సహా పంజాబ్ అంతటా ఉన్న మోహరించడంతో భారీ ముప్పు తప్పిందని చెప్పారు. వీటి ద్వారా పాకిస్తానీ డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డగించి తటస్థీకరించినట్లు తెలిపారు.