అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎల్వోసీ దగ్గర పాకిస్తాన్ తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత సీడీఎంఈ రఘునాయర్, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ శనివారం సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడించారు. భారత్ దాడుల్లో పాక్కు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. భారత్ పాక్ మిలటరీ బేస్లను ధ్వంసం చేసిందని తెలిపారు.
Operation Sindoor | మతకల్లోలకు పాక్ కుట్ర
ఆపరేషన్ సిందూర్తో పాక్ పౌరులకు ఇబ్బందులు కలగకుండా ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసిందని అధికారులు తెలిపారు. పాక్లోని ప్రార్థన మందిరాలను, పౌరులను లక్ష్యంగా చేసుకోని భారత్ దాడులు చేయలేదని చెప్పారు. కానీ పాకిస్తాన్ ఎల్వోసి వెంబడి సామాన్య పౌరులపై దాడులు చేసిందన్నారు. ఆలయాలు, గురుద్వారాలపై దాడులు చేసి భారత్లో మతకల్లోలాలు చేయాలని కుట్ర పన్నిందన్నారు.
Operation Sindoor | అసత్య ప్రచారాలు..
భారత్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాక్.. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసిందని అధికారులు తెలిపారు. ఎస్ 400 రక్షణ వ్యవస్థను, ఇండియన్ ఎయిర్బేస్లు, బ్రహ్మోస్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేసిందన్నారు. పాక్ దాడుల్లో భారత్ ఆర్మీ స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. పలువురు సామాన్య పౌరులు, జవాన్లు మృతి చెందినట్లు వివరించారు.
Operation Sindoor | సైన్యం సన్నద్ధంగా ఉంది
భారత సైన్యం పాక్తో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సర్వం సన్నద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. పాక్ దాడుల్లో భారత సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. దేశాన్ని కాపాడేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధమే అని పేర్కొన్నారు. భారత్ దాడులతో పాక్ సైన్యం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. భారత సైన్యం పాక్ ఆర్మీ బేస్లను ధ్వంసం చేసిందన్నారు.