More
    Homeఅంతర్జాతీయంIndia-Pak | స‌రిహ‌ద్దుల్లో క‌వ్వింపు చర్యలకు దిగుతున్న పాక్

    India-Pak | స‌రిహ‌ద్దుల్లో క‌వ్వింపు చర్యలకు దిగుతున్న పాక్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:India-Pak | భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తీవ్ర స్థాయిలో కొన‌సాగుతున్న త‌రుణంలో దాయాది దేశం స‌రిహ‌ద్దుల్లో మ‌రోసారి క‌వ్వింపుల‌కు పాల్ప‌డింది. జమ్మూ కాశ్మీర్‌(Jammu and Kashmir)లోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి శుక్రవారం అనేక చోట్ల పాకిస్తాన్ ఆర్మీ దళాలు(Pakistan Army troops) కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పొరుగు దేశానికి భారత సైన్యం(Indian Army) దీటుగా స‌మాధాన‌మిచ్చింది. పాక్ కాల్పులను తిప్పికొడుతూ ఎదురుదాడికి దిగింది. నియంత్రణ రేఖకు స‌మీపంలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింద‌ని ఆర్మీ వ‌ర్గాలు తెలిపాయి. వాటిని మ‌న బ‌ల‌గాలు స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టాయ‌ని పేర్కొన్నాయి. 26 మందిని బలిగొన్న పహల్​గామ్​ ఉగ్రవాద దాడి(Pahalgam terror attack) నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరపడం గమనార్హం.

    READ ALSO  Gold Mining | భూగ‌ర్భం లోప‌ల నెలల తరబడి ఉండి బంగారం త‌వ్వుతా.. కుప్పలుగా అస్తిపంజ‌రాలు కనిపిస్తాయి.. అక్రమ మైనింగ్ లో పనిచేసే ఓ వ్యక్తి గాథ..

    India-Pak | ఆర్మీ చీఫ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు..

    భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) శుక్రవారం శ్రీనగర్, ఉధంపూర్‌లను సందర్శించడానికి కొన్ని గంటల ముందు ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ పర్యటన సందర్భంగా, ఆయన కాశ్మీర్ లోయలో ఉన్న సీనియర్ ఆర్మీ కమాండర్లు(Senior Army commanders), ఇతర భద్రతా సంస్థ అధికారులతో స‌మీక్షించ‌నున్నారు. ఆర్మీ చీఫ్ ప్రస్తుత భద్రతా పరిస్థితిని అంచనా వేస్తారని, ఎల్‌ఓసీ(LOC) వెంబడి పాకిస్తాన్ సైన్యం ఇటీవల జరిపిన కాల్పుల విరమణ ఉల్లంఘనలను సమీక్షిస్తారని అధికారులు తెలిపారు.

    పహల్​గామ్​ దాడి తర్వాత సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్ తీవ్రంగా స్పందించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister narendra Modi) అధ్యక్షతన జ‌రిగిన భ‌ద్ర‌తా వ్య‌వ‌హ‌రాల క్యాబినెట్ కమిటీ(Cabinet Committee) కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా ఉపసంహరించుకునే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే, అటారీ స‌రిహ‌ద్దు(Attari border)ను మూసివేసింది. పాకిస్తాన్ పౌరుల‌కు వీసాలు నిలిపి వేయ‌డంతో ఆ దేశ పౌరులు వెంట‌నే వెళ్లిపోవాల‌ని ఆదేశించింది.

    READ ALSO  BSF Soldiers | సైనికుల కోసం స్క్రాప్ రైలు.. అమర్నాథ్ యాత్ర భద్రతకు వెళ్లే BSF జవాన్లకు అవమానం

    Latest articles

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal | షెడ్ల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...

    Harish Rao | మాజీ మంత్రి హరీశ్​రావుకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై...

    More like this

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal | షెడ్ల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...