అక్షరటుడే, వెబ్డెస్క్ : Missile attack | భారత్ ఆపరేషన్ సిందూర్ operation sindoor పేరిట పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అయితే భారత్ దాడులతో ఉలిక్కిపడ్డ పాక్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఇప్పటికే కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ LOC వెంబడి నిత్యం కాల్పులకు పాల్పడుతున్న పాక్ ఆర్మీ తాజాగా క్షిపణులను missile attack ప్రయోగించింది. బుధవారం అర్ధరాత్రి పాకిస్తాన్ మిసైల్స్తో భారత్పై దాడి చేసింది.
Missile attack | తిప్పికొట్టిన భారత్
పాక్ క్షిపణి దాడులను భారత్ తిప్పికొట్టింది. నియంత్రణ రేఖవెంబడి పాకిస్థాన్ మిస్సైల్ దాడులు చేయగా భారత రక్షణ వ్యవస్థ defence system సమర్థవంతంగా అడ్డుకుంది. పంజాబ్లోని అమృత్సర్ amritsar లక్ష్యంగా పాక్ క్షిపణులను ప్రయోగించింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్ 400 రక్షణ వ్యవస్థతో s defence system క్షిపణులను భారత్ మధ్యలోనే కూల్చి వేసింది. భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే మిసైల్స్తో పాక్ క్షిపణులను భారత్ అడ్డుకుంది.
పంజాబ్లో మిస్సైల్ భాగాలను ఆర్మీ అధికారులు గుర్తించారు. పంజాబ్లోని జెతువాల్, మఖన్ విండి, పాందేరు శివారు ప్రాంతాల్లో క్షిపణుల శకలాలు లభ్యం అయ్యాయి. మరోవైపు సరిహద్దులో బుధవారం రాత్రి నుంచి పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ కాల్పుల్లో ఇప్పటికే 14 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలను భారత ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.