అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan attacks | ఆపరేషన్ సిందూర్తో (Operation Sindoor) బుద్ధి తెచ్చుకోని పాక్ మళ్లీ దాడులకు తెగబడుతోంది.
గురువారం రాత్రి జమ్మూ ఎయిర్పోర్టుపై (Jammu airport) రాకెట్లతో దాడి చేసింది. అంతేగాకుంగా జమ్ములోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో అటాక్ (drone attacks) చేసింది. ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించినట్లు సమాచారం. దీంతో ఆర్మీ అధికారులు (army officials) జమ్ము నగరం మొత్తం బ్లాక్అవుట్ జారీ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చి వేసింది. ఈ దాడులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. డ్రోన్ పేలుళ్ల శబ్దానికి స్థానిక ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.