More
    Homeఅంతర్జాతీయంSimla Agreement | సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్​.. అసలు ఏమిటి ఈ ఒప్పందం..!

    Simla Agreement | సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్​.. అసలు ఏమిటి ఈ ఒప్పందం..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్​పై కఠినమైన చర్యలకు భారత్ చేపట్టిన దౌత్యపరమైన చర్యల నేపథ్యంలో దాయాది దేశం స్పందించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించిన నేపథ్యంలో.. 1972లో రెండు దేశాల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని (Simla Agreement) నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. అలాగే, అన్ని వాణిజ్య సంబంధాలు నిలిపివేయడంతో భారతీయ విమానాలను (Indian Airlines) తమ వాయుమార్గంలోకి రాకుండా నిషేధించింది. అయితే, పాక్ తాజా నిర్ణయం భారత్​పై పెద్దగా ప్రభావం చూపదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

    Simla Agreement | ఐదు దశాబ్దాల క్రితం నాటి ఒప్పందం

    1971లో జరిగిన యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య సిమ్లా Shimla వేదికగా ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఉద్దిశించిందే సిమ్లా ఒప్పందం. జూలై 2, 1972న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ Formar Prime Minister Indira Gandhi, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో Formar Pakistani President Zulfikar Ali Bhutto సంతకం చేసిన సిమ్లా ఒప్పందం Simla Agreement రెండు దేశాల సంబంధాలలో కీలకమైనది. ఈ ఒప్పందం ద్వారానే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

    Simla Agreement | సిమ్లా ఒప్పందం.. బంగ్లా ఆవిర్భావం

    సిమ్లా ఒప్పందం భారతదేశం, పాకిస్తాన్ Pakistan మధ్య జరిగిన ఒక ద్వైపాక్షిక ఒప్పందం Bilateral agreement. 1971 యుద్ధం తరువాత ఇది జరిగింది. ఇది తూర్పు పాకిస్తాన్ విడిపోవడానికి, స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడడానికి దారితీసింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య శత్రుత్వాలకు అధికారిక ముగింపు ఇచ్చింది. శాంతియుత సహజీవనం, ద్వైపాక్షికత ఆధారంగా భవిష్యత్ నిశ్చితార్థానికి ఒక రోడ్మ్యాప్ను నిర్దేశించింది. కాశ్మీర్​తో సహా అన్ని వివాదాలను మూడో పక్షం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. అలాగే, రెండు దేశాలు ఒకరి ప్రాదేశిక సమగ్రతను, రాజకీయ స్వాతంత్ర్యాన్ని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, పరస్పరం గౌరవించుకోవాలని అంగీకరించాయి.

    Simla Agreement | 93 వేల మంది యుద్ధ ఖైదీల అప్పగింత

    ప్రపంచంలోనే అత్యధిక యుద్ధ ఖైదీలను Prisoners of war అప్పగించిన చరిత్రను భారత్ సొంతం చేసుకుంది. సిమ్లా ఒప్పందంలో Simla Agreement భాగంగా భారతదేశం 93,000 మందికి పైగా పాకిస్తానీ యుద్ధ ఖైదీలను విడుదల చేసింది. ఇది చరిత్రలో అతిపెద్ద యుద్ధానంతర ఖైదీల విడుదలలో ఒకటి. జమ్మూకశ్మీర్​లో Jammu and Kashmir డిసెంబర్ 17, 1971న ఉన్న కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖ(ఎల్​వోసీ LOC)గా తిరిగి గుర్తించారు.. వివాదాస్పద ప్రాంతాన్ని స్థిరీకరించే ప్రయత్నంగా నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకూడదని ఇరు పక్షాలు నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య నిలిచిన కమ్యూనికేషన్లు, ప్రయాణం, వాణిజ్య సంబంధాలను తిరిగి ప్రారంభించడంతో సహా దౌత్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు.

    Latest articles

    MLA arrest | దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్టు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MLA arrest : పహల్గవ్​ మారణహోమంపై ఓవైపు దేశమంతా ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఆలిండియా...

    BRS silver jubilee celebration | బీఆర్​ఎస్​ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు : బాజిరెడ్డి జగన్​

    అక్షరటుడే, ఇందూరు: BRS silver jubilee celebration : వరంగల్ warangal​ జిల్లాలో ఈ నెల 27న తలపెట్టిన...

    ED raids| జెన్సాల్ ఇంజినీరింగ్ లో ఈడీ దాడులు.. ప్రమోటర్ పునీత్​సింగ్​ జగ్గీని అదుపులోకి తీసుకున్న ఈడీ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది....

    EPFO | ఈపీఎఫ్​ చందాదారులకు శుభవార్త.. రూ.5 లక్షలకు పెరుగనున్న ఆటో సెటిల్మెంట్ పరిమితి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) చందాదారులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఈపీఎఫ్​వో సెంట్రల్...

    More like this

    MLA arrest | దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్టు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MLA arrest : పహల్గవ్​ మారణహోమంపై ఓవైపు దేశమంతా ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఆలిండియా...

    BRS silver jubilee celebration | బీఆర్​ఎస్​ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు : బాజిరెడ్డి జగన్​

    అక్షరటుడే, ఇందూరు: BRS silver jubilee celebration : వరంగల్ warangal​ జిల్లాలో ఈ నెల 27న తలపెట్టిన...

    ED raids| జెన్సాల్ ఇంజినీరింగ్ లో ఈడీ దాడులు.. ప్రమోటర్ పునీత్​సింగ్​ జగ్గీని అదుపులోకి తీసుకున్న ఈడీ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది....
    Verified by MonsterInsights