అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | పాకిస్థాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి pahalgam terror attack ప్రతీకారంగా భారత్ పీవోకేతో పాటు పాక్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఆ దేశం తీరు మారలేదు. ఎల్వోసీ LOC వెంబడి భారీగా కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరులే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే పాక్ కాల్పుల్లో 13 మంది మృతి చెందగా.. చాలా మంది గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఈ సారి ధీటైన జవాబు ఇచ్చింది.
Operation Sindoor | ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే లక్ష్యంగా..
ఎల్వోసీ వెంబడి కాల్పులతో పాటు పాక్ భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. భారత గగనతల రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకుంది. ఎస్ 400 డిఫెన్స్ సిస్టంతో పాక్ క్షిపణులను భారత్ మధ్యలోనే కూల్చివేసింది. అయితే పాక్ దాడికి ప్రతీగా భారత్ ఈ సారి ఏకకాలంలో క్షిపణులతో విరుచుకుపడింది. ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలే లక్ష్యంగా దాడి చేసింది.
ఈ దాడిలో లాహోర్లోని HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. జమ్ముకశ్మీర్లోని LoC వెంట ఉన్న గ్రామాలపై పాక్ చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాక్ మరోసారి దాడులకు యత్నిస్తే ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. కాగా ఆపరేషన్ సిందూర్ operation sindoor ఇంకా ముగియలేదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. దీంతో పాక్పై భారత్ మరిన్ని దాడులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.