అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన నగర పద్మశాలి సంఘం (City Padmashali Sangham) కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పద్మశాలీల అభివృద్ధికి, నగర పద్మశాలి కమిటీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. అనంతరం పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోర సాయిలుతో పాటు ఇతర సభ్యులను ఎమ్మెల్సీ కవిత సన్మానించారు.