అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | నిజామాబాద్ నగరంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో ఈనెల 8న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు దాసరి నర్సింలు పేర్కొన్నారు. గురువారం ఖలీల్వాడిలో (Khaleelwadi) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించిన వధూవరుల పరిచయ వేదికకు అనూహ్య స్పందన లభించిందన్నారు. పద్మశాలి కులస్థులు తమ బంధుమిత్రులకు పరిచేయ వేదిక వివరాలు అందజేయాలని సూచించారు. వధూవరుల రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రుసుము లేదన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ప్రతినిధులు మైసల నారాయణ, బీమర్తి రవి, లోల రాజేందర్ ఆడెపు రాజన్న దిండిగళ్ల శంకర్, దోర్నాల రవి, కోడూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.